టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రామ్  కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా  ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ సినిమాకి చార్మి పూరి ఇద్దరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన పాటలు  ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి. ఇప్పటికే ఈ సినిమాపై 100 కోట్లకు పైగానే బిజినెస్ కూడా జరిగింది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ  సినిమాకి ఇప్పటివరకు

 76 కోట్ల వసూళ్లు వచ్చాయి అని అంటున్నారు. దాంతోపాటు థియేట్రికల్ రైట్s ను అన్ని భాషల్లో కలిపి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. అంతేకాదు రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా డబల్ స్మార్ట్ సినిమా నిలిచిపోయింది. అయితే గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. కాగా ఈ సినిమా ట్రైలర్ ని ఆగస్టు 4న వైజాగ్ లో విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ లాంచింగ్ వైజాగ్ లో గ్రాండ్గా

 నిర్వహించబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది. దీని తర్వాత ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారట. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా డార్లింగ్ ప్రభాస్ ని ఇన్వైట్ చేయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారంట. ప్రభాస్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేశాడు. ఈ సినిమాలు కమర్షియల్ హీరోగా ప్రభాస్ ఇమేజ్ ని పెంచాయి. బుజ్జిగాడు సినిమాతోనే ప్రభాస్ కి డార్లింగ్ అనే ఇమేజ్ వచ్చింది. అలాగే డబుల్ ఇస్మార్ట్ ప్రొడ్యూసర్ ఛార్మికి కూడా ప్రభాస్ తో మంచి బాండింగ్ ఉంది. ప్రభాస్ చక్రం, పౌర్ణమి సినిమాలలో ఛార్మి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికి పూరి జగన్నాథ్, ఛార్మితో ప్రభాస్ కి మంచి రిలేషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ని డబుల్ ఇస్మార్ట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటున్నారంట. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: