ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని అందుకుందో  చెప్పనవసరం లేదు. 2021లో విడుదలైన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో సైతం సత్తా చూపించింది. అలా అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ పరంగా కూడా రికార్డు సృష్టించింది. ఏకంగా ఈ సినిమాతో అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు సైతం దక్కింది. అయితే అలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వల్ గా పుష్ప టు

 సైతం తరికెక్కిస్తున్నారు. దీంతో ఇప్పటినుండి ఈ సినిమాపై భార్యా అంచనాలో నెలకొన్నాయి. పుష్ప సినిమాకి మించే విధంగా పార్టీతో ఉండబోతుంది అని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు బృందం. నిజానికి ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్ 6న పుష్పా టూ విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. కానీ పుష్ప టు విడుదల కాకముందే నిర్మాతలకి భారీ నష్టాన్ని మిగిల్చినట్లుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు

 వస్తున్నాయి. పుష్ప-2 సినిమా రిలీజ్ కాకముందే.. నిర్మాతలకు 50 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పుష్ప-2 సినిమా వాయిదా పడడమే అన్నట్లుగా సమాచారం.  సినిమా షూటింగ్ వాయిదా పడుతూ ఉండడంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారికి దాదాపుగా 35 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందట. అలాగే ఇందులో ప్రొడక్షన్ షెడ్యూల్, మార్కెట్ ఇతరత్రా ఖర్చులను కలుపుకొని మరో 15 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. పుష్ప-2 సినిమా పైన భారీ హైప్ ఉన్నది కానీ ఈ సమయంలో వాయిదా పడుతూ ఉండడం చేత ఈ సినిమా ఎఫెక్ట్ కచ్చితంగా ఓపెనింగ్ డే మీద పడేటట్లు ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రకంగా కూడా నిర్మాతలు భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: