యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  రాజమౌళి  కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి 2003 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కాగా అప్పట్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచిన సినిమా ఏదనే ప్రశ్నకు సైతం సింహాద్రి సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. తాజాగా మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ సిరీస్ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగా ఇందులో సింహాద్రి సినిమా చూసిన సమయంలో చిరంజీవి ఏ విధంగా ఫీలయ్యారో చరణ్ వెల్లడించారు.స్టూడెంట్ నెం.1' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఎస్ఎస్ రాజమౌళి.. ఎన్టీఆర్ తోనే తన రెండో చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అదే 'సింహాద్రి'. అయితే ఈ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యపోయారని రామ్ చరణ్ చెప్పారు. 'మగధీర' సినిమాకి ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింహాద్రి' సినిమా చూసి తన తండ్రి చిరంజీవి విస్తుపోయారని చెప్పారు. ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు, రెండో చిత్రానికే అంత పెద్ద సీనియర్ స్టార్ హీరోనే మెప్పించారంటే రాజమౌళి ప్రతిభా పాటవాలు, దర్శకత్వ పటిమ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.కొన్ని విశేషాలు స్టార్లు వాళ్ళుగా చెబితే తప్ప బయటికి రావు. తగిన సందర్భం కుదరాలంతే. ఇవాళ నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళి మీద రూపొందించిన మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ సిరీస్ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.గంటన్నర పాటు ఆయన ప్రయాణం, కెరీర్ లో చూసిన ఎత్తుపల్లాలు, పని చేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేయడంతో అందరు హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏమేం చెప్పి ఉంటారానే ఆసక్తి ఇద్దరి ఫ్యాన్స్ లో అధికంగా ఉంది. మచ్చుకు ఒక సాంపిల్ చూద్దాం.

ఇది స్వయంగా చరణ్ చెప్పిందే. మగధీరకు ముందు ఆయన తండ్రి చిరంజీవి సింహాద్రి చూశారట. ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ అనిపించే రేంజ్ లో జక్కన్న దర్శకత్వం చూసి నోట మాట రాలేదట. అంత మెగా స్టార్ నే కేవలం రెండో సినిమాతోనే మెప్పించిన దర్శక ధీర అప్పట్లోనే ఏ స్థాయిలో ప్రభావం చూపించారో ఈ ఉదాహరణను బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే సింహాద్రి టైంలో చిరుకి గట్టి పోటీ ఇచ్చేవాడు వచ్చాడంటూ అప్పటి కొన్ని మీడియా సాధనాల్లో తారక్ పై కథనాలు వచ్చేవి. దానికి తగ్గట్టే సింహాద్రి ఆ టైంలో నెలకొల్పిన రికార్డులు మామూలువి కాదు.చరణ్ జక్కన్న డైరెక్షన్ గురించి కామెంట్స్ చేసిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ అవుతున్నారు. 20 సంవత్సరాల వయస్సులో జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో బరువైన పాత్రను పోషించి తన నటనతో మెప్పించారు.జూనియర్ ఎన్టీఆర్ ఏడో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డులు సైతం అన్నీఇన్నీ కావు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఈ నాలుగు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయనే చెప్పాలి. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా స్నేహం ఉందనే సంగతి తెలిసిందే.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. చరణ్ తారక్ లకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే చరణ్, తారక్ నటించిన సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: