వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్ లో స్టార్ హీరో అయినటువంటి మోహన్లాల్ పాల్గొనేందుకు ముందుకు వచ్చారు . టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు ఆయన చేరుకున్నారు ‌. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్ట్నెంట్ కల్నల్ గా ఉన్న మోహన్లాల్ .. విపత్తు ప్రయత్నాన్ని సందర్శించి సైనికులతో సమావేశం కానున్నారు . కోజికోడ్ నుంచి రోడ్ మార్గంలో వయనాడ్ కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్యలు జరిపారు . ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మోహన్ లాల్ పై అభిమానులు ప్రశంసలు గురిపిస్తున్నారు .


వయనాడ్ లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 3508కి చేరుకుంది . ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ అండ్ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు . ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు ఇచ్చారు . కమల్ హాసన్ మరియు నయనతార సహా పలువురు సినీ సెలబ్రిటీలు విరాళాలు అందజేశారు . ఈ విపత్తులో వందలాదిమంది గల్లంతయ్యారు .


వారి ఆచూకీ కోసం డ్రోన్లను అండ్ రాధార్లు , మొబైల్ సిగ్నల్స్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు . ఇక ఇందులో మోహన్ లాల్ కూడా పాల్గొనడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . మీలాగానే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా . ఏదేమైనాప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . ప్రస్తుతం మోహన్ లాల్ సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ మూవీస్ చేస్తున్నప్పటికీ తక్కువ సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వస్తున్నారు . గతంలో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన ప్రజెంట్ ఆడపాదడపా చిత్రాలు చేయడంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు . ఇక వారిని సంతృప్తి పరిచేందుకే ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: