మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా నిహారిక "కమిటీ కుర్రాళ్ళు" అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ ని ఆగస్టు 9 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె ఈ సినిమా ప్రమోషన్లను దగ్గరుండి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 5 వ తేదీన ఫ్రీ రిలీజ్ జాతర అనే పేరుతో నిర్వహించబోతున్నారు. ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ జాతర ఈవెంట్ ను ఆగస్టు 5 వ తేదీన సాయంత్రం 6 గంటలకి దాస్ పల్లి కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ నీ కూడా విడుదల చేశారు. 

నిహారిక ఈ సినిమాను నిర్మించిన మెగా హీరోలు అంతా కూడా ప్రస్తుతం తమ తమ పనులతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఎవరూ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయలేకపోయారు. దానితో ఈమె ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ నిహారిక బిజీగా ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం అక్కినేని హీరోను రంగంలోకి దించడానికి నిహారిక డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు , ఇప్పటికే నిహారిక , చైతూ ను సంప్రదించగా నాగ చైతన్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగ చైతన్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలియజేసే అధికారిక ప్రకటన ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి నిహారికమూవీ తో నిర్మాతగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: