అదిరిపోయే కటౌట్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ ఒకరు. అభిమానులు గోపీచంద్ ని మాస్ యాక్షన్ చిత్రాల్లో చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. కెరీర్ ఆరంభంలో గోపీచంద్ గుర్తింపు కోసం విలన్ రోల్స్ చేసారు. మహేష్ బాబు నిజం, నితిన్ జయం, ప్రభాస్ వర్షం చిత్రాల్లో గోపీచంద్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ పోస్ట్ చేయడానికి ప్రత్యేక కారణమే ఉంది.గోపీచంద్.. ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినప్పటికీ, విలన్ గా కూడా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. నితిన్ ‘జయం’ మూవీలో గోపీచంద్ ఏ రేంజ్ లో విలనిజం చూపించాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించాడు ఈ మ్యాచో స్టార్. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘విశ్వం’ అనే మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు ఈ స్టార్ హీరో. ఆ పోస్ట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉందండోయ్. అదేంటంటే?2001లో వచ్చిన ‘తొలి వలపు’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మ్యాచో స్టార్ గోపీచంద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. యజ్ఞం, లక్ష్యం, లౌక్యం, రణం, శౌర్యం, గోలీమార్ ఇలా విజయవంతమైన చిత్రాలు ఎన్నో తన కెరీర్ లో చేశాడు. అయితే గోపీచంద్ ఇండస్ట్రీలోకి వచ్చి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. అందులో మ్యాచో స్టార్ ఈ విధంగా రాసుకొచ్చాడు.“నా 23 ఏళ్ల సినీ కెరీర్ లో నాకు సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నా కో స్టార్స్, డైరెక్టర్స్, నిర్మాతల సహకారం మరిచిపోలేనిది. ఇక అభిమానుల ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు ఇక్కడున్నాను. మీరే నా బలం. మీ రుణం తీర్చుకోలేనిది. నా కెరీర్ లో మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేనిది. ఇలాగే మీ మద్ధతు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం మూవీతో మళ్లీ కలుద్దాం” అంటూ  పోస్ట్  చేశాడు గోపీచంద్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: