ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం "డబుల్ ఇస్మార్ట్". ఈ మాస్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాకుండా పూరి జగన్నాథ్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన సినిమాలు ఎప్పుడూ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. రామ్ పోతినేని డబుల్ రోల్ చేస్తుండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ. ఇది ఇలా ఉంటే ఈ ట్రైలర్ ను ఆదివారం 4 వ తేదీన అంటే ఈరోజు సాయంత్రం 7:33 నిమిషాలకు ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు.

రామ్ పోతినేని మరియు సంజయ్ దత్ లపై ఒక స్టైలిష్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి టైం లోక్ చేశారు. "డబుల్ ఇస్మార్ట్" ట్రైలర్‌లో రామ్ పోతినేని యొక్క యాక్షన్ సీన్స్, డైలాగ్స్, డ్యాన్స్ మూవ్‌మెంట్స్ చూడవచ్చు. పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, సంభాషణలు ఈ ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. ఈ చిత్రంలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటిస్తున్నారు. ఇక ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ట్రైలర్ లాంఛ్ ని వైజాగ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారు.

కాగా "డబుల్ ఇస్మార్ట్" చిత్రం ఆగస్ట్ 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన విషయం తెలియగానే సోషల్ మీడియాలో ఈ చిత్రం పై చర్చ జోరుగా సాగుతోంది. రామ్ పోతినేని మరియు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీగా ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమాలోని సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని అంచనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: