ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజ్ తరుణ్ వ్యవహారమే హైలెట్ గా నిలుస్తుంది. ఇక రాజ్ తరుణ్ గురించి ఒక్కొక్క విషయం బయట పడుతున్న నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన రెండు సినిమాలు విడుదలవ్వడం, అవి ప్లాఫ్ అవ్వడం ఆయనను మరింత కుంగదీసింది అని చెప్పుకోవచ్చు. ఓవైపు ఆయన గురించి నెగిటివిటీ పెరిగిపోతున్న సమయంలో మరోవైపు ఆయన సినిమాలు ప్లాప్ అభిమానులకు కాస్త నిరాశ అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రాజ్ తరుణ్ దగ్గర నుండి డబ్బులు కొట్టాయాలని ఓ వ్యక్తి చూసారట.మరి ఇంతకీ ఆయన ఎవరు.. ఎందుకు రాజ్ డబ్బులు కొట్టేయాలని చూసారు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా చేసిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే మూవీతో తొలిసారి తెలుగు తెరకు హీరో గా పరిచయమయ్యారు. 

ఇక మొదటి సినిమానే హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కి హీరోగా గుర్తింపు లభించింది.ఆ తర్వాత సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్ వంటి మూడు సినిమాలు హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు రాజ్ తరుణ్. కానీ ఆ తర్వాత ఈయన చేసిన వరుస సినిమాలు ఫ్లాప్.. అలా సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, రంగులరాట్నం, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త,ఒరేయ్ బుజ్జిగా,లవర్, అనుభవించు రాజా, పురుషోత్తముడు రీసెంట్గా వచ్చిన తిరగబడరా సామి..ఈ సినిమాలన్నీ ఏమాత్రం హిట్టు కొట్టలేదు. దాంతో ఈ హీరో కెరియర్ కొద్ది కొద్దిగా ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు లావణ్య వివాదం.. దీంతో ఈయన సినీ కెరియర్ పూర్తిగా నాశనం అవుతుందని కొంతమంది భావిస్తున్నారు .

అయితే అలాంటి రాజ్ తరుణ్ దగ్గర మేనేజర్ గా నటుడు రాజా రవీంద్ర చేస్తారనే సంగతి మనకు తెలిసిందే. రాజ్ తరుణ్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలన్నీ రాజా రవీంద్రనే చూసుకుంటారు. అంతేకాకుండా రాజ్ చేసిన ప్రతి సినిమాలో రాజా రవీంద్ర ఉంటారు. అయితే అలాంటి రాజా రవీంద్ర ఓసారి రాజ్ తరుణ్ మోసపోకుండా కాపాడారట. అదెలా అంటే రాజ్ తరుణ్ ని ఓ వ్యక్తి మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు కొట్టేయాలని చూసారట. కానీ ఈ విషయం గ్రహించిన రాజా రవీంద్ర వెంటనే ఆ వ్యక్తిపై కేసు పెట్టడంతో ఆ అనర్థం జరగకుండా ఆగిందట. లేకపోతే ఆ వ్యక్తి వల్ల రాజ్ తరుణ్ కోట్ల రూపాయల నష్టపోయేవారట. అయితే కోట రూపాయల విషయం చెప్పారు కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం రాజా రవీంద్ర బయట పెట్టలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: