పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రీసెంట్ గా ‘క‌ల్కి 2898 AD’తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సైఫై మ‌థాల‌జి మూవీగా తెర‌కెక్కించిన తీరు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే, ఇప్పుడు ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై ఫోక‌స్ పెట్టాడు.ఇప్ప‌టికే ”ది రాజా సాబ్” చిత్రాన్ని రెడీ చేస్తోన్న ప్ర‌భాస్, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో ”స్పిరిట్” అనే సినిమాను తెరకెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇప్పటికే కొరియ‌న్ న‌టుడు డోంగ్ లీ ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తాడ‌నేది టాక్.ఇండస్ట్రీలో హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో.. అలాగే హీరో-హీరోయిన్ కాంబోకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. పలానా హీరోతో పలానా హీరోయిన్ నటిస్తే చూడాలని ఉందని చాలా మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉంటారు. ఇక ఒకసారి హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి.. ప్రేక్షకులను ఫిదా చేస్తే.. మళ్లీ మళ్లీ ఆ జోడీని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటారు అభిమానులు. ఇక టాలీవుడ్ లో ఇలాంటి హిట్ కెమిస్ట్రీ కలిగిన జంటలు చాలానే ఉన్నాయి. అలాంటి జోడీనే ముచ్చటగా మూడోసారి కాదు.. ఏకంగా నాలుగోసారి జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడీగా నాలుగోసారి స్టార్ హీరోయిన్ నటించబోతోంది. ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటించబోతున్నట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ త్రిష ఈ మూవీలో నటిస్తే.. ఏకంగా నాలుగోసారి ప్రభాస్ కు జోడీగా నటించినట్లు అవుతుంది. ఇంతకు ముందు ఈ జంట వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించి.. తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి వెండితెరపై ఈ జోడీ కనువిందు చేయనుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో డార్లింగ్ ప్రభాస్ కి జోడీగా వర్షం సినిమాలో త్రిష నటించింది. ఆమెకి టాలీవుడ్ లో వర్షం రెండో సినిమా. వర్షం మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుస్తుంది.ఆ సినిమానే త్రిషకి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ప్రభాస్, త్రిష పౌర్ణమి సినిమాలో జతకట్టారు. ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయిన డార్లింగ్ ప్రభాస్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. తరువాత 2008లో బుజ్జిగాడు సినిమాలో మూడో సారి ప్రభాస్ త్రిష కలిసి నటించారు. 16 ఏళ్ళ తర్వాత మరల స్పిరిట్ సినిమాలో ప్రభాస్, త్రిష జంటగా నటించబోతున్నారనే మాట వినిపిస్తోంది. అదే నిజమైతే స్పిరిట్ సినిమాకి మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కోలీవుడ్ లో కూడా స్పిరిట్ సినిమాకి మంచి బజ్ అందుబాటులో ఉందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: