మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన యాంకరింగ్ తో పాటు అందాలతో కూడా జనాలను ఆకట్టుకోవడంతో ఈమెకు ఈ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అలాగే తన అందాలను కూడా ఆరబోస్తూ రావడంతో ఈమెకు సినిమాలలో కూడా అవకాశాలు విపరీతంగా పెరిగాయి.

కొంత కాలం క్రితం అనసూయ పాన్ ఇండియా మూవీ అయినటువంటి పుష్ప పార్ట్ 1 లో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు ఇతర భాష సినిమాల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. దానితో సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన ఈమె కొంత కాలం పాటు టీవీ షో లకు దూరం అయింది. మళ్ళీ ఈమె టీవీ షోలలో పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ సింబ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ టికెట్లను ఫ్రీ గా పొందేందుకు ఒక ఆప్షన్ ను ఇచ్చింది.

అందుకుగాను ఎవరైనా మొక్కలను నాటి వాటి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు అయితే వారికి ఈ సినిమా టికెట్లను ఫ్రీ గా ఇవ్వబోతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మోస్ట్ గ్లామరస్ బ్యూటీ అయినటువంటి అనసూయ నటించిన సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: