నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మరి కొంత కాలం లోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బాలకృష్ణ కుమారుడు ఆ దర్శకుడి సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ... ఈ దర్శకుడి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ , మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మోక్షజ్ఞ సరసన ఒక అదిరిపోయే బ్యూటీ ని హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ డ్యూటీ మరెవరో కాదు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్.

మోక్షజ్ఞ సరసన ఖుషి కపూర్ ని హీరోయిన్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు అందులో భాగంగా ఈ బ్యూటీ తో మరికొన్ని రోజుల్లో సంప్రదింపులు కూడా జరిపే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ కుమారుడు నటించబోయే మొదటి సినిమా కావడంతో ఈ మూవీ ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: