తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో సూపర్ సక్సెస్ ను తెలుగు సినీ పరిశ్రమలో అందుకున్న ఈమెకు ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.

ఇక ప్రస్తుతం ఈమె తెలుగు కంటే కూడా తమిళ , హిందీ సినీ పరిశ్రమలపై అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాదులో మరియు వైజాగ్ లో ఈమె F -45 పేరుతో అనేక జిమ్ లను ఏర్పాటు చేసింది. ఆవి బాగానే సక్సెస్ అయ్యాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈమె ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఆరంభం అనే పేరుతో కొంత కాలం క్రితమే హైదరాబాద్ , చెన్నై , బెంగళూరు లో వెజ్ రెస్టారెంట్ లను ఓపెన్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో హైదరాబాదులోని కావేరి హిల్స్ ప్రాంతంలో తన మొదటి బ్రాంచ్ ను ఈ బ్యూటీ ప్రారంభించింది. అది సూపర్ గా సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు తాజాగా రకుల్ తన రెండో బ్రాంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇనే స్టా గ్రామ్ స్టోరీ లో ఈ బ్యూటీ పోస్ట్ చేసింది. కొండాపూర్ లో తన రెండవ ఔట్లెట్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇలా సినిమాలతో మాత్రమే కాకుండా ఓ వైపు జిమ్ బిజినెస్ లోకి , మరో వైపు ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి కూడా ఈ ముద్దుగుమ్మ బాగానే సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రకుల్ ఆఖరుగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత ఈమె తెలుగు లో ఏ మూవీ లో కూడా నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: