పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ సినిమా ‘కల్కి 2898 ఎడి’. ఈ మూవీలో ప్రభాస్ సహా కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు నటించడంతో ఇండియన్ సినిమా నుంచి మరో గ్రేట్ సినిమాగా నిలిచింది. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది. పార్ట్ 1లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్ కూడా పార్ట్ 2 షూటింగ్ కొంతభాగం అయింది. 2025లో మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తాము అని తెలిపారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంతో ప్రభాస్ మళ్ళీ సాలిడ్ కం బ్యాక్ ని అందుకోగా ఈ చిత్రం తర్వాత తన నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్

 లు రాబోతుండగా వీటిలో దర్శకుడు మారుతీతో తెరకెక్కిస్తున్న సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. ఇదిలా ఉంటే కల్కి  కేవలం తొలి పార్ట్‌ మాత్రమే. అసలైన కథ రెండో పార్ట్‌లో ఉంటుందని మేకర్స్‌ ఇప్పటికే పలుసార్లు తెలిపారు. సినిమా క్లైమాక్స్‌ చూసినా ఇదే విషయం అర్థమవుతోంది. కల్కి సినిమా ఏకంగా వెయ్యి కోట్లకుపైగా రాబట్టగా సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కల్కి సీక్వెల్‌కు సంబంధించి షూటింగ్ కూడా కొంతమేర పూర్తయిన విషయం తెలిసిందే. కల్కి పార్ట్‌ 2కి సంబంధించి మేజర్ పార్ట్స్‌ షూటింగ్‌ ఇప్పటికే పూర్తయిందని మేకర్స్ ఇది వరకే తెలిపారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ వేయి కళ్లతో

 ఎదురు చూస్తున్నారు. కమల్‌హాసన్‌, అమితాబ్‌, ప్రభాస్‌ల మధ్య ఊహకందని యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని నాగ్ అశ్విన్ పలు ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో సహజంగానే ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇదిలా ఉంటే కల్కి పార్ట్1ని తీసుకొచ్చేందుకు నాగ్ అశ్విన్ ఏకంగా 4 ఏళ్లకుపైగా తీసుకున్నాడు. దీంతో పార్ట్‌2 కూడా ఆలస్యమవుతుండొచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సీక్వెల్‌కు మొదటి భాగానికి పట్టినంత సమయం పట్టదని వీలైనంత త్వరగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కల్కి సీక్వెల్‌కు సంబంధించిన 20 రోజుల షూటింగ్ పూర్తయినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. ఈ లెక్కన కల్కి సీక్వెల్ చిత్రం మరో రెండేళ్లలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: