టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు పొందిన రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మిరపకాయ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు మీరు కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇక ఈ సినిమా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ పనులు ప్రస్తుతం శరవేగంగా చేస్తోంది. చిత్ర బృందం.


ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి బజ్ లేని ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసే సమయానికి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నిన్నటి రోజున చిత్ర బృందం ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా మొదటి డైలాగు నుంచి మేకర్స్ ఆకట్టుకునేలా చేశారు. ట్రైలర్లో రవితేజ డైలాగులతోనే అదరగొట్టేసేలా కనిపిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్  ఆఫీసర్ గా కనిపిస్తే బోతున్నారు.


 ఈ సినిమా ట్రైలర్ లో కూడా రవితేజ హీరోయిన్స్ మధ్య జరిగే రొమాన్స్ డ్రామా సన్నివేశాలు కూడా యూత్ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. టైటిల్ రోల్ రవితేజ నటన మరొకసారి కనిపించబోతోంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అంద చందాలతో మరొకసారి ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో జగపతిబాబు, సత్య, నెల్లూరు సుదర్శన్ తదితర సినిమా సెలబ్రిటీలు సైతం కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు సైతం ధీమాని తెలియజేస్తున్నారు. మరి పూర్తిగా తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: