ఎంతోమంది కొత్త హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తున్నా కానీ ఇంకా కొత్తదనం కోరుకుంటారు టాలీవుడ్ ఫ్యాన్స్.ఇక మధ్యలో కొంతమంది హాట్ బ్యూటీస్ కొన్ని రోజుల వరకు ఆ లోటు తీర్చినట్లు కనిపిస్తుంటారు కానీ అది మాత్రం అలాగే ఉండే  ఇష్యూగా మారిపోతుంది.త్రిష, అనుష్క, నయనతార లాంటి సీనియర్స్ స్టార్ హీరోయిన్స్ తర్వాత.. కాజల్, తమన్నా, సమంత లాంటి హీరోయిన్స్ అయితే 5-10 ఏళ్ళ వరకు హీరోయిన్స్ లేని కొరతను తీర్చేసారు. కానీ ఇప్పుడొస్తున్న హీరోయిన్లకు అంత స్టామినా మాత్రం ఉండట్లేదు.పట్టుమని 10 సినిమాలు చేయగానే కనిపించకుండా పోతున్నారు. ఆ మధ్య ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి అలాగే వచ్చింది.. ఆ తర్వాత వచ్చిన శ్రీలీల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రెండు మూడేళ్ల పాటు ఏ సినిమాలో చూసినా ఈమెనే కనిపించింది. ఓ టైమ్‌లో అయితే ఏకంగా 10 సినిమాలు చేసింది శ్రీలీల. ఏ సినిమా షూటింగ్‌కు ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది శ్రీలీల. కానీ గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల కూడా డల్ అయిపోయింది.


ఇప్పుడు అందరూ కూడా భాగ్యశ్రీ బోర్సే వైపు చూస్తున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీతో ఈ మరాటి బ్యూటీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే ఈ హాట్ బ్యూటీ గురించి అంతా ఆరా తీస్తున్నారు. కచ్చితంగా రేపు కానీ మిస్టర్ బచ్చన్ హిట్ అయిందంటే మాత్రం.. భాగ్యశ్రీ కెరీర్ పూర్తిగా మారిపోవడం పక్కా. ఆగస్ట్ 15 వ తేదీన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కానుంది.  ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టీవ్ గా పాల్గొంటుంది ఈ చిన్నది. ఎక్కడ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ జరిగినా కానీ ఈ బ్యూటీ యే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. కానీ రవి తేజ మాత్రం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. ఎందుకంటే తన మిత్రుడు పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆగష్టు 15 న విడుదల కాబోతుంది. కాబట్టి క్లాష్ కి సంబందించిన ప్రశ్నలు వస్తాయని రవి తేజ ప్రమోషన్స్ కి హాజరు కావట్లేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: