తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయంకృషితోనే వచ్చి.. తనలోని టాలెంట్లను నిరూపించుకుని నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరించడంతో పాటు టాప్ హీరోగా హవాను చూపిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇలా ఇప్పుడు 'విశ్వంభర' చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా 'విశ్వంభర'ను చేస్తున్నాడు. దీన్ని 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోంది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.విజువల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, ఇప్పుడు మరో షెడ్యూల్ ప్రారంభించగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది.అదేమిటంటే ఈ చిత్రం కోసం ఎప్పుడు నుంచో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి ముందు అసలు ట్రీట్ సినిమా టీజర్ కోసం ఇప్పుడు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ టీజర్ ని మెగాస్టార్ బర్త్ డే కానుకగా వదిలే ఛాన్స్ ఉందని ఇప్పటికే టాక్ ఉంది. మరి ఈ క్రమంలో లేటెస్ట్ బజ్ ఈ టీజర్ పై వినిపిస్తుంది. దీనితో ఈ టీజర్ కోసం ఏ విజువల్స్ ఎంతవరకు తీసుకోవాలి అనేది ఫిక్స్ చేసేసారట. అలాగే టీజర్ ఎడిటింగ్, మిక్సింగ్ పనులు కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: