టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ పరిస్థితి ప్రస్తుతం తారుమారైంది. చాలా వేగంగా సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్న జగన్.. ఇప్పుడు వరుస ఫ్లాప్స్ చవిచూడాల్సి వస్తోంది. ప్రత్యేకించి గతేడాది విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించిన ‘లైగర్’ మూవీ డిజాస్టర్ కావడం పూరీని కోలుకోలేని దెబ్బకొట్టింది. దీనివల్ల విజయ్‌తో ఆల్రెడీ స్టార్ట్ అయిన ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. అప్పటి నుంచి మరో హీరోతో సినిమా కోసం ఎంత ట్రై చేసినా కుదరలే. చిరంజీవి లేదా బాలకృష్ణతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా ఎందుకో మెటీరియలైజ్ కాలేదు.ఇదిలావుండగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వం లో రామ్‌ పోతినేని నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా కనిపించాడు. షాయాజీ షిండే, అలీ, గెటప్‌ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. డబుల్‌ ఇస్మార్ట్‌ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదలైంది.బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం రామ్‌ నుంచి అభిమానులు ఆశించే ఫన్‌, యాక్షన్‌, రొమాంటిక్‌, కామెడీ ఎలిమెంట్స్‌తో స్టైలిష్‌గా తెరకెక్కించినట్టు రషెస్‌తో హింట్ ఇచ్చేశారు మేకర్స్‌. అయితే మరి లైగర్‌ లాంటి భారీ డిజాస్టర్‌ తర్వాత తెరకెక్కించిన ఈ చిత్రం పూరీ జగన్నాథ్‌కు కమ్‌ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిందా..?అనే దానిపై చర్చ కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో పూరి నెక్స్ట్ సినిమా పై ఆసక్తికరా విషయాలు చర్చనియాంసం గా మారాయి.ఎందుకంటే ఆయన చేస్తున్న సినిమాలు ఆయన తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కమర్షియల్ జానర్లోనే ఉండటమే కాకుండా ఆయా హీరోని చాలా వరకు ఎలివేట్ చేస్తూ ఉంటాయి.అందువల్లే ఆయన సినిమాల్లో హీరో ఒక డిఫరెంట్ మేనరిజంతో మాడ్యులేషన్స్ తో కనిపిస్తూ ఉంటాడు.
అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఆయన సినిమాల్లోని హీరోలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.ఇక రవితేజ, మహేష్ బాబు లాంటి హీరోలను స్టార్లుగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.ఇక మొత్తానికైతే ఆయన చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత మరొక సినిమాకి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన తెలుగులో ఉన్న ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ హీరో ఎవరు అనే దానిమీద ఇంకా సరైన క్లారిటీ రాలేదు.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోకి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక వీళ్ళ ఆ భారీ హీరోతో ఒక గొప్ప చిత్రం అయితే రాబోతుంది అనే వార్తలు కూడా ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.మరి ఆ స్టార్ హీరో ఎవరు అంటే కొంతమంది బాలయ్య బాబు పేరు చెబుతున్నారు.అలాగే మరి కొంతమంది వెంకటేష్ పేరు కూడా చెబుతున్నారు.మరి వీళ్ళిద్దరిలో ఆయన ఏ హీరో తో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే పూరి నెక్స్ట్ సినిమాను మన తెలుగు హీరోలతోనే చేస్తుండటం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: