ప్రభాస్ అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే "కల్కి 2898 AD" సినిమాతో 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మంచి కిక్ ఇచ్చిన ప్రభాస్ ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక కల్కి చిత్రం త్వరలోనే ఓటీటీ లో విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
 ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో "ది రాజా సాబ్" సినిమా చేస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే మరో ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజులో ఈ ప్రాజెక్టు అఫిషియల్ అప్‌డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఆగష్టు 17 జరగనుందని, సెప్టెంబర్ 21 తమిళనాడులో షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వివరాలపై అధికారిక ప్రకటన కోసం ఇంకా వేచి చూడాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, పూజా కార్యక్రమం రోజునే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని సమాచారం.
ప్రస్తుతం "ఫౌజీ" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారం అవుతున్న ఈ సినిమా, ఒక ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని వినిపిస్తోంది.

రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమ కథను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ నటించనున్నారని తెలుస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించబడనుంది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత వైభవంగా రూపొందించడానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సుదీప్ చట్టర్జీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఇక అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తిగా పీరియడ్ డ్రామా నేపధ్యంలో నడిచే సినిమా కావడంతో, ప్రభాస్ ఈ సినిమాలో కనిపించే విధానం అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతుందని భావిస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ అప్డేట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.ఇదిలావుండగా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో హను రాఘవపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని చెబుతున్నారు.ఇక ఈ స్టోరీని ఒక కొత్త ప్రపంచంలో చూపించబోతున్నారట. ఆ ప్రపంచాన్ని సృష్టించడం కోసం.. దాదాపు వంద ఎకరాల్లో భారీ సెట్ ని నిర్మిస్తున్నారట. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త ప్రభాస్ అభిమానులను సంతోష పరుస్తుంది. కాగా ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ సెప్టెంబర్ 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారని చెబుతున్నారు.అయితే చిత్ర నిర్మాతలను నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. మరి ఈ చిత్రాన్ని అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీతో పాటు ఈ చిత్రాన్ని కూడా షూట్ చేయనున్నారట. ఈ రెండు పూర్తీ అయిన తరువాత కల్కి అండ్ సలార్ సెకండ్ పార్ట్స్ ని ప్రారంభించనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: