సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.అక్కడ ఎవరికి సక్సెస్ దొరుకుతుందో ఎవరిని ఫెయిల్యూర్ వెక్కిరిస్తుందో చెప్పలేని పరిస్థితి.సక్సెస్ అందుకున్న చోటే ఫెయిల్యూర్స్ కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది.నిరాజనాలు అందుకున్న చోటే అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన పూరి జగన్నాథ్ కూడా ఒకానొక సమయంలో అప్పుల ఊబిలో కూరుకపోయాడు.తన దర్శకత్వంలో హిట్ సినిమాలు కొట్టిన హీరోలు ఎవరు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చింది.తెలుగు ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం దర్శకుడు పూరీ జగన్నాథ్. ఎన్నిసార్లు పడినా కూడా లేవడం ఈయన శైలి. ఇంకా చెప్పాలంటే జీరో అయ్యాడు అనుకున్న ప్రతీసారి హీరో అవుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. రెండేళ్ల కింది వరకు పూరీని పెద్దగా పట్టించుకోలేదు మన హీరోలు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు.స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా వెలుగుందిన పూరిజగన్నాథ్ ను  కష్టకాలం వెంటాడుతుంది. డైలాగ్స్,స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేసే ఈ క్రేజీ డైరెక్టర్ కు వరుస ప్లాపులు ఎదురవుతున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి 8 చిత్రాల్లో ఇస్మార్ట్ శంకర్ మినహా మిగతావన్నీ ప్లాప్ అయ్యాయి.

తాజాగా డబులు ఇస్మార్ట్ కు డివైడ్ టాక్ వస్తుండటంతో పూరి మార్కెట్ టేకింగ్ మిస్ అయిందని ఇక వింటేజ్ పూరిని చూడలేమా?అని పోస్టు లు పెడుతున్నారు.పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల్లో క‌థ అంటూ పెద్ద‌గా ఉండ‌దు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌తోనే మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటాడు. హీరోల్లోని మాస్ కోణాన్ని ప‌తాక స్థాయిలో చూపిస్తుంటాడు. ఆ ఫార్ములా ఇస్మార్ట్ శంక‌ర్ లో వ‌ర్క‌వుట్ అయ్యింది. అందుకే స‌క్సెస్ కోసం ఇస్మార్ట్ శంక‌ర్‌లో రామ్‌ క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు ఆ సినిమాలోని మెమోరీ ట్రాన్స్‌ఫ‌ర్ అనే పాయింట్ చుట్టూ రివేంజ్ క‌థ‌ను అల్లుకుంటూ డ‌బుల్ ఇస్మార్ట్ మూవీని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌.డ‌బుల్ ఇస్మార్ట్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తోంది. మాస్ రోల్‌లో రామ్ అద‌ర‌గొట్టాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. అత‌డి ఎన‌ర్జీ, డైలాగ్ డెలివ‌రీ బాగున్నాయ‌నే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. అయితే డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ టేకింగ్‌, మేకింగ్‌లో మాత్రం కొత్త‌ద‌నం మిస్స‌యింద‌ని చెబుతోన్నారు.లైగ‌ర్ ప‌రాజ‌యంపై డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. డ‌బుల్ ఇస్మార్ట్ స‌క్సెస్‌తో ఈ విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని పూరి భావించాడు. కానీ అత‌డికి మ‌రోమారు నిరాశ ఎదుర‌వ్వ‌క‌త‌ప్ప‌ద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: