కీర్తిసురేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్.. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా ఈ చిన్నది తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మహానటి సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో పాటు తెలుగులో తిరుగులేని హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తిసురేష్.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తోంది. గ్లామర్ రోల్స్ చేస్తో అభిమానులను ఆకట్టుకుంటుంది. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కాస్త గ్లామర్ గా కనిపించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ఈ చిన్నది.సో షల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూవుంటుంది.ఇదిలావుంటే దసరా మూవీ తో కీర్తి సురేష్ మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే.నాచురల్ స్టార్ నాని తో నటించిన దసరా సినిమాకు సీక్వెల్ పై హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తనకు ఆ క్యారెక్టర్ అంటే ఇష్టమని, డైరెక్టర్ శ్రీకాంత్ సీక్వల్ కు సిద్ధంగా ఉంటే తాను రెడీ అని అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె రిప్లై ఇచ్చారు. తనకు హైదరాబాద్ లో దొరికే గుంటూరు ఇడ్లీ, నెయ్యి కారం దోస ఇస్తామన్నారు.ఉప్పుకప్పురంబు తో త్వరలో ప్రేక్షకులను అలరిస్తానని చెప్పారు.ప్ర‌స్తుతం కీర్తి సురేష్ త‌మిళంలో మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది.వీటిలో ర‌ఘుతాత మూవీ ఆగ‌స్ట్ 15న రిలీజ్ అయింది.హిందీ భాష కార‌ణంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌తో ఫ‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీని కేజీఎఫ్ ఫేమ్ హోంబ‌లే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ రైట‌ర్ సుమ‌న్ కుమార్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.రివాల్వ‌ర్ రీటా, క‌న్నీవీడు సినిమాలు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశాల‌తో రూపొందుతోన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్‌ల‌ను కీర్తిసురేష్ దాదాపుగా పూర్తిచేసిన‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: