కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన కార్తీ తాజాగా నటిస్తున్న సర్దార్-2 సినిమా లో  నటిస్తున్నారు. అభిమానులను చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూసేలా చేస్తోంది. ఈ చిత్రం తెలుగు తమిళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సర్దార్ సినిమా కూడా బైల్వింగల్ మూవీ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సర్దార్ -2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. S.జె సూర్య కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సర్దార్ సినిమాలో కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలలో అలరించారు కార్తీ.. అంతేకాకుండా తను చేసిన ప్రతి పాత్రకు కూడా అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు.


ఈ చిత్రంలో ఇప్పటికే హీరోయిన్గా మాళవిక మోహన్, ఆషిక రంగనాథ్ వంటి వారిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మేకర్స్ మరొక అప్డేట్ సైతం విడుదల చేశారు. సర్దార్ సినిమాలో ఆకట్టుకున్నటువంటి హీరోయిన్ రజిషా విజయన్ ను  సర్దార్-2 లో తీసుకువచ్చేలా క్రూషియల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలియజేశారు . ఈ సందర్భంగా మేకర్స్ ఆమెకు వెల్కమ్ చెబుతూ ఒక స్పెషల్ విశేషం కూడా తెలియజేస్తే పోస్టర్ని సైతం విడుదల చేశారు. సర్దార్-2 సినిమాని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.



సర్దార్ చిత్రానికి మించి మరి ఈసారి టాప్ టెక్నీషియన్స్ తో సర్దార్-2 చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు డైరెక్టర్. ఇక సంగీతాన్ని కూడా యువన్ శంకర్ రాజా తో అందించబోతున్నారు. గత ఏడాది కార్తీ నటించిన జపాన్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటకట్టుకున్నారు. అలాగే ఖైదీ-2 చిత్రంలో కూడా నటిస్తూనే ఉన్నారు కార్తీ. మరి ఈ రెండు చిత్తాలతో ఈసారి మంచి విజయాన్ని అందుకొని అభిమానులను ఖుషి చేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: