కోలీవుడ్ లో ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అభిమానులను మెప్పిస్తూ ఉంటారు హీరో ధనుష్. ముఖ్యంగా తన నటనతో డైలాగులతో సినిమాను సక్సెస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ధనుష్ తన సినీ కెరియర్లో 50వ చిత్రం గా స్వయంగా తానే దర్శకత్వంతో పాటు హీరోగా నటించిన చిత్రం రాయన్. ఇందులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా నటించారు అలాగే ప్రకాష్ రాజ్,sj .సూర్య ,అపర్ణ బాలమురళి ,సెల్వ రాఘవన్ తదితర నటీనటుల సైతం ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జులై 26న థియేటర్లు విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మంచి హిట్టు టాకుతో దూసుకుపోయింది.


సుమారుగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన రాయన్ చిత్రం తెలుగులో కూడా బాగానే ఆకట్టుకుంది. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ లో విడుదలవుతుందా అంటు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటి హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ గా ఆగస్టు 23న ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతోంది అంటూ తెలియజేస్తోంది. తెలుగు తమిళ భాషలతో పాటు కన్నడ హిందీ మలయాళ తమిళ్ వంటి భాషలలో కూడా ఈ సినిమాని స్ట్రిమింగ్ చేయబోతున్నారు.


ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా  తెలియజేస్తోంది. అందుకు సంబంధించి ఒక అధికారికంగా పోస్టర్తో రిలీజ్ చేస్తుంది. రాయన్ చిత్రంలో ధనుష్ చెల్లెలుగా దుర్గగా దుషార విజయన్ నటించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, శరవరన్ తదితర నటి నటులు కూడా ఇందులో నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ కూడా సంగీతాన్ని అందించడం విశేషము. మరి థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఈ సినిమా ఓటీటీలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: