మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు నిర్మాతగా పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ ఉన్నది..నిహారిక తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక తన గురించి తన కుటుంబం గురించి చెబుతూ పలు విషయాలను తెలిపింది. ముఖ్యంగా తన ఫస్ట్ సంపాదన గురించి కూడా అడగగా టీవీ షోలోకి రాకముందు తాను చేసిన పని గురించి తెలియజేసింది.


నిహారిక సినిమాలలోకి రాకముందు హైదరాబాదులో ఉండి ఒక కేఫ్ లో కూడా పని చేశానని అక్కడ వాళ్ళు తనకి వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవారని కూడా తెలియజేసింది.. అయితే తనని తన తండ్రి మాత్రం ఎక్కడికి పంపించేవారు కాదని అందుకే ఇక్కడే చదువుకోవలసి వచ్చింది అంటు తెలిపింది నిహారిక. డీ షోలో యాంకర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత ఒక మనసు అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతే ఇమే మంచి క్రేజీ సంపాదించడంతో పలు టీవీ షోలకు గెస్ట్లుగా కూడా రావడం జరిగింది నిహారిక.


జొన్నలగడ్డ చైతన్య వివాహం చేసుకున్న తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయినప్పటికీ.. నిర్మాతగా సొంత బ్యానర్ ను స్థాపించి మళ్లీ పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నది నిహారిక. అంతేకాకుండా మెగా కుటుంబంలో నటించినటువంటి కొన్ని చిత్రాలలో కూడా నిహారిక కీలకమైన ప్రాంతాలలో నటించింది. నిర్మాతగా తన తండ్రి సక్సెస్ కాలేకపోయినా నిహారిక మాత్రం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. రెండో పెళ్లికి సంబంధించి నిహారిక పైన ఎప్పుడూ కూడా రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి వీటి పైన కూడా నిహారిక స్పందిస్తూ కచ్చితంగా జీవితంలో ఒక తోడు ఉండాలి అయితే సరైన భాగస్వామి వస్తే కచ్చితంగా వివాహం చేసుకుంటారని కూడా తెలిపింది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి: