బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండగా.. మరొక అవకాశం హీరో రామ్ చరణ్ తో జోడిగా నటించేందుకు సంపాదించింది. హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మకు డిమాండ్ అయితే తగ్గడం లేదు. సోషల్ మీడియా ద్వారా పలు రకాలలో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా అతిలోక సుందరి శ్రీదేవి బ్రాండ్ కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా ఉపయోగపడుతోంది.


తాజాగా జాన్వీ ఐషారామి అనే కారును కొనుగోలు చేసింది. ఈ లగ్జరీ కారు బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ తో పాటు మరెవరి దగ్గర కూడా లేదట. జాన్వీ కపూర్ లెక్సస్ ఎల్ ఎం 350 కారు ను సైతం కొనుగోలు చేసింది. దీని ధర 2.50 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజు తో కలుపుకుంటే సుమారుగా మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారు చూడడానికి చాలా లగ్జరీగా ఉన్నప్పటికీ నాలుగు సీట్ల కారు రెండు వరసలలో చాలా విలాసవంతమైన సౌకర్యంగా కూడా ఇందులో ఉండవచ్చు.


ఇక సెవెన్ సీటర్ కలిగి ఉంటుందట. అలాగే ఇందులో వెంటిలేటర్ వ్యవస్థ కూడా కలిగి ఉన్నది. వెనుక సీటు కోసం ప్రత్యేకమైన టీవీ సిస్టం కూడా అమర్చడం జరిగింది. అంతేకాకుండా కారులో చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. రణబీర్ కపూర్ కొన్న ఈ కారు కొద్ది రోజులకే జాన్వీ కపూర్ కొనడం జరిగింది. జపాన్ బ్రాండ్ కు చెందిన ఈ కారు ప్రత్యేకమైన అక్కడ డిజైన్ చేయడం జరిగిందట. ఒకవైపు బాలీవుడ్ మరొకవైపు టాలీవుడ్ లో సినిమాలతో బాగానే సంపాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: