టాలీవుడ్ బాలీవుడ్ లో అలనాటి హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ శిల్పా శెట్టి.. తెలుగులో వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య అనే చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో తరచూ శిల్పా శెట్టి ఏదో ఒక విషయంలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. అటు పర్సనల్ లైఫ్ ఫిట్నెస్ విషయంలో కూడా చాలానే ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా ఈమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా  గతంలో అసభ్యకరమైన సినిమా ప్రొడక్షన్ కేసులో కూడా అరెస్టు కావడం జరిగింది. అప్పటినుంచి శిల్పా శెట్టి గురించి ఈమె డబ్బు కోసమే అతడిని వివాహం చేసుకుంది అనే విధంగా చాలామంది ట్రోల్స్ చేయడం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పా శెట్టి ఈ విషయం పైన పలు విషయాలను తెలిపింది. రాజ్ కుంద్రా బ్రిటీష్ భారతీయులలో 108వ ధనవంతుడని అలాగే సినిమాలలో నటిస్తున్నప్పుడు కూడా తాను కూడా ఒక ధనవంతురాలని ఇప్పటికీ కూడా తాను రిచ్ గానే ఉన్నానని కేవలం డబ్బు కోసమే రాజ్ కుంద్రాను వివాహం చేసుకోలేదంటూ తెలియజేసింది.


ఒక విజయవంతమైన స్రి తనకు అన్ని విధాలా కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటుంది అందుకే తాను కూడా రాజ్ కుంద్రా ను వివాహం చేసుకున్నానంటూ తెలిపింది. రాజ్ కుంద్రా తో పెళ్లికి ముందు చాలా మంది ధనవంతులు సైతం క్యూ కట్టారు. కానీ వారి జీవితంలో ఎక్కువగా ఆర్థిక విషయాలకే అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు వాస్తవ జీవితానికి ఎవరు ఇవ్వలేదని తెలిపింది. శిల్ప, రాజ్  లవ్ స్టోరీ కూడా అప్పట్లో వైరల్ గా మారింది. వీరిద్దరి మీద పలు రకాల ఆరోపణలు చేసుకున్న వీరిద్దరు ఎప్పుడు కూడా విడిపోలేదు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: