కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో సూర్య ఒకరు. ఇకపోతే సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న కాంగువ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని చాలా రోజుల క్రితమే అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ కి తాజాగా ఒక పెద్ద షాక్ తగిలింది. అది రజనీ కాంత్ నుండి జరిగింది.

అసలు ఈ మూవీ కి రజనీ కాంత్ ద్వారా వచ్చిన ప్రమాదం ఏమిటో తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు వెట్టయన్ సినిమాను కూడా అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హీరో కావడంతో రజనీ కాంత్ సినిమా విడుదల అవుతుంది అంటే తమిళ ప్రేక్షకులు సూర్య మూవీ కంటే రజిని మూవీ సైడే మక్కువ ఎక్కువ చూపించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. దానితో ఇంత వరకు సూర్య సోలోగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లను రాబడదాము అనుకున్నాడు. కానీ అదే తేదీన రజినీ మూవీ కూడా రాబోతూ ఉండడంతో ఈ సినిమా కలెక్షన్లకు కాస్త ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు మూవీలలో ఈ మూవీ కి మంచి టాక్ వస్తుందో ... ఏ మూవీ బారి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: