టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ ఇప్పటికి కూడా మంచి దశలో కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఈ నలుగురిలో బాలకృష్ణ ఒక్కడి ఆలోచన కాస్త డిఫరెంట్ గా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కేవలం ఈ ఒక్క సినిమాపై మాత్రమే చిరంజీవి ఫోకస్ పెట్టాడు. మధ్యలో కొన్ని రోజుల పాటు చిరంజీవి తన తదుపరి మూవీ ని కూడా ఓకే చేయబోతున్నాడు అని వార్తలు వచ్చిన ఇప్పటి వరకు చిరంజీవి నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

ఇకపోతే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తప్పితే వెంకటేష్ కూడా మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా నా సామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సాసీఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న నాగార్జున తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ఇవ్వడం లేదు.

ఇలా చిరంజీవి , వెంకటేష్ ఒక్కో మూవీ లో నటిస్తూ రాగా నాగార్జున మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించకుండా చాలా ఫోకస్ గా మంచి కథ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం ఓ వైపు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే ... ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా బాలయ్య ఒక్కడే ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: