టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అలా నటించిన వారిలో విజయశాంతి, రమ్యకృష్ణ ,రాధా ,రంభ, రాధిక  తదితర హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి కొంత మంది హీరోయిన్లతో చిరంజీవి నటించిన లేకపోయారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ గౌతమి కూడా ఒకరు. అప్పట్లో సౌత్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. గౌతమి తన నటన ప్రతిభతో అంత పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఈమె నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో మాత్రమే నటించిందట.


ఒక ఇంటర్వ్యూలో గౌతమి చిరంజీవి తో నటించకపోవడం పైన పలు విషయాలను తెలియజేసింది.. చిరంజీవి గారితో తాను నటించలేదని ఆయన చాలాసార్లు బాధపడ్డారనీ  తెలిపింది..ఆ విషయం తనను కూడా బాధకు గురి చేస్తూ ఉంటుంది అంటూ తెలిపింది. ముఖ్యంగా తనని మూడుసార్లు తన సినిమాలో నటించమని అడిగినప్పటికీ తాను వేరే చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్లు కుదరలేక చాలా రిక్వెస్ట్ చేసిన కూడా డేట్లు అడ్జస్ట్ కాలేక నటించలేకపోయాను అంటూ తెలిపింది గౌతమి.


ఆ సమయంలో రజినీకాంత్ తో ఒక సినిమా కమిట్ కావడం వల్ల సమస్యగా మారింది. మరో ఇద్దరు హీరోలతో కూడా సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల చిరంజీవి తో సినిమాలు మిస్ చేసుకోవలసి వచ్చిందని తెలిపింది గౌతమి. అయితే ఈ విషయం పైన చిరంజీవి గారితో ఇప్పటివరకు చెప్పలేదని ఒకవేళ ఆయన కనిపిస్తే ఖచ్చితంగా ఆయనకి ఈ విషయం తెలియజేస్తానని తెలిపింది గౌతమి. గౌతమి హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సమయంలోనే హీరో కమలహాసన్ తో ఈమె రిలేషన్ లో ఉండేది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. చిరంజీవి ఇప్పటికీ హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. గౌతమి అడపా దడపా చిత్రాలలో నటిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: