టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొంతమంది అట్టర్ ప్లాప్ అవుతున్నారు. కొంతమంది హీరోయిన్లు అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలాంటి హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన చేయడమే కాకుండా రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసి అందరిని మెప్పించింది.  తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా అమ్మనట్టి వరకు వెలుగొందిన రకుల్ ఇప్పుడు డీలపడింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పోటీ ఎక్కువ పెరగడంతో రకుల్కు ఎక్కువగా చాన్సులు రావడం లేదు. దాంతో ఆమె స్థానాన్ని ఇతరులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 

ముఖ్యంగా పూజ హెగ్డే, శ్రీ లీలా రష్మిక మందన లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో... రకుల్ ప్రీత్ సింగ్కు చాన్సులు లేకుండా పోయాయి.  అదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ వైపు చూస్తోంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా చాన్సులు దక్కించుకోవడం లేదు. ఇక ఇటీవల భారతీయుడు రెండవ భాగం సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో రకుల్ కు పెద్దగా క్రేజ్ దక్కలేదు.

 

ఇటీవల పెళ్లి చేసుకున్న రకుల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. అదృష్టం అనే పదం కరెక్టో కాదో నాకు తెలియదని... కానీ సినిమాల్లో తనకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. తనను ఆదరించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పారు రకుల్ ప్రీత్ సింగ్. తన జీవితంలో ఎన్నో హాటు పోటులు వచ్చాయని కానీ ఇప్పుడు.. తాను ముందుకు సాగుతున్నానని తెలిపింది.  జీవితంలో ఒక మెట్టు ఎదగడానికి ఎవరు అడిగినా సహాయం చేస్తానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: