టీవీ సీరియల్స్‌ ఆడవారికి ఎంతో నచ్చుతుంటాయి డైలీ సీరియల్ చూడకుండా కొంతమంది ఆడవాళ్లు అసలే ఉండదు. సీరియల్ స్టోరీస్ బాగుంటే వాటిని తప్పనిసరిగా చూస్తుంటారు. ఆ సీరియల్స్‌లో కార్తీకదీపం ఒకటి. ఇది హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించింది. అంతేకాదు బుల్లితెర బాహుబలి అనే పేరు కూడా తెచ్చుకుంది. స్టార్ మా ఛానెల్ లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి పూట టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ ఆడవాళ్లు అసలు మిస్ కారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయిన వంటలక్క ఫుల్ ఫేమస్ అయ్యింది. దీన్ని నటి ప్రేమి విశ్వనాథ్ పోషిస్తుంది.

 ప్రేమి విశ్వనాథ్ తెలుగు అమ్మాయి కాదు. ఆమెది కేరళ కానీ తెలుగులో బాగా క్లిక్ అయింది. కార్తీక దీపం సీరియల్ తర్వాత ఆమె ప్రతి ఇంటి ఆడపడుచు గా మారింది. ఈ సీరియల్ ఫస్ట్ సీజన్ పూర్తి కాక ఇప్పుడు "కార్తీక దీపం: ఇది నవ వసంతం" పేరుతో కొత్త సీజన్ ప్రారంభమైంది. ఇది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. హైయెస్ట్ టిఆర్పీ రేటింగ్‌తో సంచలనాలు క్రియేట్ చేస్తోంది.

నటి ప్రేమి విశ్వనాథ్ సింగిల్ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. ఆమెకు వచ్చిన పాపులారిటీ మరే ఇతర టీవీ నటికి రాలేదంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది తన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. అంతే కదా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కూడా పాల్గొంటూ తన ఫ్యామిలీ గురించి తెలియజేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ వంటలక్క తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.

తెలుగు కార్తీకదీపం సీరియల్ చేసే అవకాశం రావడంతో తాను తన భర్త, పిల్లలను కేరళలోనే వదిలి వచ్చేసాను. చాలా బిజీ షెడ్యూల్ కారణంగా నేను మా ఆయనతో కలిసి టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. మా వారు కూడా చాలా బిజీగా ఉంటారు. నేను కేరళలో ఉన్నప్పుడు.. ఆయన తన కెరీర్ వర్క్స్ కారణంగా వేరే రాష్ట్రంలో ఉండేవారు. ఎప్పుడు చూసినా మేమిద్దరం వేరువేరు రాష్ట్రాల్లో నివసిస్తుంటాం. కెరీర్ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది పెద్దగా ఆస్వాదించలేకపోతున్నాం. ఎప్పుడో ఒకసారి బ్రేక్ తీసుకొని ఇద్దరం కలుసుకుంటాం. అని ప్రేమి విశ్వనాథ్ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన  ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: