రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్‌స్టార్. ఎందుకంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. వీటితో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ రీజనల్ మూవీస్ కూడా చేస్తోంది.అయితే ఈమెకు ఇప్పుడు ఊహించని చిక్కొచ్చి పడింది. ఒకేరోజు ఈమె రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుండటమే దీనికి కారణం.రష్మికకు పాన్ ఇండియా స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమా 'పుష్ప'. సీక్వెల్‌తో డిసెంబరు 6న ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. మరోవైపు ఇదే తేదీన 'చావా' అనే బాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. విక్కీ కౌశల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ పీరియాడికల్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. డిసెంబరు 6నే థియేట్రికల్ రిలీజ్ అని ప్రకటించారు. విచిత్రం ఏంటంటే ఇందులోనూ రష్మికనే హీరోయిన్.నేషనల్ క్రేజ్ రష్మిక మాములుగా లేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప హిట్ తో అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప -2లో బన్నీ సరసన నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో బన్నీ, రష్మికపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ డిసెంబరు 6న రిలీజ్ కు గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. మరోవైపు క్రష్మిక బాలీవుడ్ లో దూసుకు వెళుతోంది. తాజగా విక్కీ కౌశల్ సరసన ‘చావా’ చిత్రంలో నటిస్తుంది క్రష్మిక.

ఈ చిత్ర ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేసారు మేకర్స్. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఆధారంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను కూడా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. దింతో ఒకేరోజు, ఒకేసారి, ఒకే ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతన్న హీరోయిన్ గా క్రష్మిక క్రేజ్ సంపాదించింది. బాలీవుడ్ లో సోలో రిలీజ్ దొరుకుతుందని భావించిన పుష్ప -2కు చావా రూపంలో పోటీ ఎదురైంది.ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఛావా. ఈ సినిమాను కూడా డిసెంబర్ 06న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నట్లు తెలుస్తుంది.అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో చాలా పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో కంటే పుష్ప చిత్రం బాలీవుడ్‌లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఛావా గట్టి పోటి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చావా చిత్రం మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌గా రాబోతుంది. ఈ సినిమాలో శివాజీగా విక్కీ నటిస్తున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండబోతున్నాయి.ఈ క్రమంలో ఒకే రోజున రష్మిక రెండు సినిమాలు విడుదల కానున్నాయి. రెండు చిత్రాలు హిట్ అవ్వాలని నేషనల్ అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: