ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఏది చేసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలెట్ గానే నిలుస్తుంది. అంతలా పాపులర్ అయ్యారు ప్రముఖ వేణు స్వామి. ముఖ్యంగా నాగచైతన్య అలాగే సమంత విడాకుల విషయం ముందే చెప్పారు వేణు స్వామి.

 


ఈ తరుణంలోనే అప్పటినుంచి వేణు స్వామికి మంచి డిమాండ్ కూడా పెరిగిపోయింది. అయితే తాజాగా.. హీరోయిన్ శోభిత మరియు నాగచైతన్య ఎంగేజ్మెంట్ పైన... ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి చేసిన ప్రకటనతో ఆయన జీవితం తలకిందులు అయిపోయింది. వేణు స్వామికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు తెలంగాణ జర్నలిస్టులు.  అయితే తెలంగాణ రాష్ట్రం తో పాటు ఏపీ జర్నలిస్టులకు వ్యతిరేకంగా ప్రముఖ ఆస్ట్రాలజిస్టు వేణు స్వామి పోరాటం చేస్తూనే ఉన్నారు.


 

ఇక లేటెస్ట్ గా... ఓ సంచలన వీడియో విడుదల చేసి.. అందరినీ షాక్  కు గురిచేశారు వేణు స్వామి కుటుంబ సభ్యులు. వేణు స్వామి అలాగే ఆయన భార్య ఇద్దరు కలిసి.. తాజాగా  ఓ వీడియో పెట్టడం జరిగింది. జర్నలిస్టు మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వేలు స్వామి ఆయన భార్య శ్రీవాణి. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను కూడా ఎంతో ఆవేదనతో విడుదల చేశారు.

 

ఈ వీడియో కథనం ప్రకారం... జర్నలిస్టు మూర్తి 2017 నుంచి తమ పైన దుష్ప్రచారం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వేణు స్వామి దంపతులు.  అదే సమయంలో 8 నెలలుగా మళ్లీ వేధిస్తూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కూడా తీసుకువచ్చారని... వేణు స్వామి దంపతులు ఫైర్ అయ్యారు.  మేము 5 కోట్ల మొత్తాన్ని ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కానీ ఈ వీడియో చేసినందుకు వాళ్ళు కచ్చితంగా తమను చంపేస్తారని కూడా వివరించారు. అందుకే వాళ్ళు ఎలాంటి వాళ్ళు బయటపెడుతున్నామని తెలిపారు వేణు స్వామి దంపతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: