ప్రస్తుతం మీడియాలో జర్నలిస్టు మూర్తి, వేణు స్వామికి సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.నేను ఎంతో మంది జీవితాలను సరిదిద్దాను.వాళ్ల జీవితాలు బాగుపడేలా పూజ చేశాను. కానీ జర్నలిస్టు మూర్తి మాత్రం నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. నాపై ఫేక్ ప్రచారం సృష్టిస్తూ నాకు వ్యతిరేకంగా కొంతమంది జ్యోతిష్యులు క్లయింట్లను పిలిచి వచ్చి తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నాడు. నాపై డిబేట్లు పెట్టి ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన టార్చర్ భరించలేక గత ఎనిమిది నెలల నుండి నేను 15 కేజీల బరువు తగ్గాను. ఆయన నుండి మాకు ప్రాణహాని ఉంది. నన్ను 2017 నుండి టార్గెట్ చేస్తున్నారు.అప్పటినుండి నాపై దాడి చేస్తూనే ఉన్నాడు. 

ఆయన చేసే ఆరోపణలు,దాడి తట్టుకోలేక నాకు నేనే సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను. అంటూ వేణు స్వామి సంచలన వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ విషయం పై తాజాగా క్లారిటీ ఇచ్చిన జర్నలిస్టు మూర్తి ఓ వీడియో పెట్టాడు.మూర్తి మాట్లాడుతూ.. నేను ఐదు కోట్లు వేణు స్వామిని అడిగినట్టు నిరూపిస్తే నన్ను కొట్టి చంపేయండి. దేనికంటే దానికి రెడీగా ఉన్నాను.ఒకవేళ నేను చనిపోయాకనైనా నామీద నేరం రుజువైతే గవర్నమెంట్ హాస్పిటల్ లో నా ఎముకలకు మూర్తి ద్రోహి అని రాసి పెట్టండి. నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎక్కడా కూడా నేను చిల్లిగవ్వ తీసుకోలేదు. నేను పని చేసే సంస్థలో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తాను కావచ్చు.

కానీ బయట ఎక్కడ కూడా కనీసం టీ నీళ్లు కూడా తాగలేదు.నేను ఎంతో పెద్ద పెద్ద కేసులను బయటకు తీస్తాను. అలాంటి కేసులు బయటకు తెచ్చినప్పుడు నాకు ఎంతోమంది డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా నేను దేనికి తలొగ్గలేదు. ఏపీలో  అప్పట్లో గవర్నర్ ఎండి తివారి కి సంబంధించిన ఎన్నో విషయాలు నేను బయట పెట్టాను. అంత పెద్ద హై ప్రొఫైల్ కేసు బయటికి తీసినప్పుడే వారికి నేను డబ్బుకు లొంగలేదు  అలాంటిది ఈయన దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తానా? ఒకవేళ నేను 5 కోట్లు అడిగినట్టు ప్రూఫ్ ఉంటే నేను దేనికంటే దానికి రెడీ అంటూ జర్నలిస్టు మూర్తి సంచలన వీడియో పెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: