కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగితే. వైసిపి పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగింది. ఇది ఇలా ఉంటే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కుటుంబం మరియు అల్లు అర్జున్ కుటుంబలు ఎంతో దగ్గర బంధుత్వం కలిగిన వారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మొదటి నుండి కూడా మెగా కుటుంబం పవన్ కళ్యాణ్ కు సపోర్టును ఇస్తూ వచ్చింది. 

ఇక అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ప్రచారానికి ఆఖరి రోజు ఆయన పోటీ చేసిన పిఠాపురం కు విచ్చేశాడు. ఇక అదే రోజు అల్లు అర్జున్ వై సీ పీ పార్టీ నాయకుల్ని గెలిపించాలి అంటూ నంద్యాలలో ప్రచారం చేశాడు. ఇక్కడే అసలైన చర్చ మొదలైంది. ఆ తరువాత నాగబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడం. అది రచ్చ కావడంతో ఆయన డిలీట్ చేయడం. ఇలాంటి కారణాల వల్ల మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు వచ్చాయి అని అనేక వార్తలు వచ్చాయి. ఇకపోతే వీటిపై ఈ ఫ్యామిలీకి సంబంధించిన కొంత మంది అలాంటిది ఏమీ లేదు అని అన్నా అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయంలో జనాలు ఉన్నారు.

ఇది ఇలా ఉంటే రావు రమేష్ తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 21 వ తేదీన నిర్వహించనున్నారు. అల్లు అర్జున్సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నాడు. అల్లు అర్జున్ ఇందులో కనుక మెగా , అల్లు కుటుంబాల మధ్య విభేదాల గురించి ఏమైనా మాట్లాడతాడా అని జనాలు అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి సంఘటన ఏదైనా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటు చేసుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa