ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అనేక పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలు ఏవి. వాటికి సంబంధించిన షూటింగ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా హార్రర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రస్తుతం శంషాబాద్ లో మూవీ బృందం వారు చత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన రొమాంటిక్ సన్నివేశాలను ఈ మూవీ బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 6 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ  , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో అల్లు అర్జున్ మరియు కొంత మంది పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: