కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇంద్ర మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఆ సమయంలో అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాను ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీస్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే నైజాం ఏరియాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా లండన్ లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా పయనిస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి సినిమా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే.

మూవీ రీ రిలీజ్ లో భాగంగా టోటల్ రన్ ముగిసే సరికి లండన్ లో 13 వేల యూరొల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇంద్ర సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన రోజే 11యూరోల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలో ఫుల్ రన్ లో ఈ సినిమాకు 30 వేలకు పైగా యురొల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే ఇంద్ర సినిమా లండన్ లో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: