తాజాగా జాతీయ అవార్డు లకు సంబంధించి న లిస్టు విడుద ల అయిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక ఈ సంవత్సరం జాతీయ అవార్డుల విషయం లో తెలుగు సినీ పరిశ్రమకు భారీ ఎదురు దెబ్బే తగిలింది. పోయిన సంవత్సరం జాతీయ అవార్డుల విషయం లో తెలుగు సినీ పరిశ్రమకు అద్భుతమైన స్థాయి లో అవార్డులు వచ్చాయి . మరి ముఖ్యం గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందున పుష్ప మూవీ లోని అల్లు అర్జున్ నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు దక్కింది . దీనితో తెలుగు సినిమా ఖ్యాతి అత్యంత ఎత్తుకు ఎదిగింది.

ఇక ఈ సంవత్సరం కూడా తెలుగు సినీ పరిశ్రమకు పోయిన సంవత్సరం మాదిరిగానే భారీ ఎత్తున జాతీయ అవార్డులు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సారి కేవలం కార్తికేయ 2 సినిమాకు మాత్రమే అవార్డు వచ్చింది. అది కూడా జాతీయ అవార్డులలో ప్రాంతీయ సినిమాకి. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు కూడా జాతీయ అవార్డు వచ్చింది.

కాకపోతే అది తెలుగు సినిమాకు కాకుండా ఇతర భాష సినిమాకు గాను ఆయనకు అవార్డు వచ్చింది. ఇలా ఈ సంవత్సరం జాతీయ అవార్డులను దక్కించుకునే విషయంలో తెలుగు సినీ పరిశ్రమ చాలా వెనుకబడిపోయింది. ఇకపోతే ఈ సంవత్సరం జాతీయ అవార్డులలో ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డును దక్కించుకున్న కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: