పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలను మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భూమిక హీరోయిన్గా నటించగా ... ఎస్ జె సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరింత పెరగగా , ఈ సినిమాతో భూమిక కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.

అలాగే ఈ మూవీ కి దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య కు కూడా ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎస్ జె సూర్య సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు. అందులో భాగంగా వరుస సినిమాలలో నటిస్తున్నాడు. తాజాగా ఈయన నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుంది.

ఇకపోతే తాజాగా ఎస్ జె సూర్య పవన్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పకచ్చాడు. ఎస్ జె సూర్య తాజాగా మాట్లాడుతూ ... ఖుషి మూవీ తర్వాత పవన్ కి ఒక లవ్ స్టోరీ కథలు వినిపించాను. అప్పుడు అది బాగుంది అన్నాడు. కానీ కొంత సమయం తర్వాత చేద్దాం అన్నాడు. ఆ తర్వాత ఆయన బిజీ అయిపోయాడు. లేకుంటే ఆ సినిమా ఆ సమయంలో పవన్ పై బ్లాక్ బాస్టర్ విజయం అందుకునేది అని సూర్య తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: