విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో వరుసగా తన రాబోయే సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ చేస్తున్న సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న VD12 సినిమా అప్డేట్ ఇచ్చారు.తాజాగా విజయ్ దేవరకొండ మరో సినిమా అప్డేట్ వచ్చింది. గతంలో ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమాని ప్రకటించారు. VD14 వర్కింగ్ టైటిల్ తో ఓ ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు.ఇతిహాసాలు రాయలేదు, అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి అని ఆసక్తికరంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచారు.

విజయ్ దేవరకొండ రాజుల కాలంలో యోధుడిగా పీరియాడిక్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇవ్వనుందని, త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారని అన్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో కథ గురించి వచ్చిన కొన్ని వివరాలు సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది విజయ్ కి మొట్టమొదటి డ్యూయల్ రోల్ మూవీ కాగా పక్క పక్కనే నటిస్తారా? లేక వేర్వేరు సమయాల్లో ఉన్న పాత్రలా? అనేది తెలియాల్సి ఉంది.ఈ నేపథ్యంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. ఇందులో ఓ పాత్రలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని చర్చ నడుస్తుంది.కాగా ఈ మూవీలో రష్మిక హీరోయిన్గా నటిస్తారని టాక్.ఈ మూవీ అక్టోబర్ నవంబర్లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: