టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల స్థాయికి చేరిపోయాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా బద్రి సినిమా కథను పవన్ కళ్యాణ్ కు వినిపించిన విధానం గురించి ఆయన చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ తాజాగా మాట్లాడుతూ ... నేను పవన్ తో సినిమా కోసం చాలా రోజుల నుండి అతని వెంటపడ్డాను. అది అతనికి మరియు అతని మేనేజర్ ఇద్దరికీ కూడా తెలుసు. దానితో ఒక రోజు పవన్ కళ్యాణ్ నా కథ వినడానికి ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని ఆయన మేనేజర్ నాకు చెప్పాడు. ఇక మేనేజర్ నాకు ఉదయం నాలుగు గంటలకు రండి పవన్ గారు కథ వింటాడు అను అన్నాడు.

దానితో అంతా ఉదయం ఎవరి వింటారు అని నేను అనగా సార్ ఉదయమే లేస్తారు. మీరు ఆ నాలుగు గంటలకు వచ్చి కథ చెప్పండి అన్నారు. దానితో నేను మూడు గంటలకే లేచాను. రెడీ అయ్యి అతనికి దగ్గరికి వెళ్లాను. ఇక పవన్ అర్థ గంట మాత్రమే సమయం ఇస్తాను కథ చెప్పమన్నాడు. నేను అర్ధ గంట సరిపోదు సార్ ... నేను కథ చెబుతూ వెళ్తాను. మీకు ఎక్కడ బోర్ కొడితే అక్కడ రూమ్ డోర్ తీయండి నేను వెళ్ళిపోతాను అని అన్నాను. ఇక ఆయన అలా కథను 4 గంటల పాటు విన్నాడు అని పూరి జగన్నాథ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: