పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో రీమిక్ సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన అనేక రీమిక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక పార్టీని స్థాపించిన తర్వాత సినిమాల్లో నటించకుండా కేవలం రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నట్లు అందుకోసం సినిమాలు మానేయనున్నట్లు ప్రకటించాడు. ఇక దానితో ఆయన అభిమానులు సినిమాలు చేయండి అనే వాదనను గట్టిగా వినిపించారు.

దానితో అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు. అందులో భాగంగా హిందీ లో అద్భుతమైన విజయం అందుకున్న పింక్ మూవీ రీమేక్ గా రూపొందిన వాకిల్ సాబ్ అనే సినిమాతో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ రీమిక్ సినిమా స్టార్ట్ కావడానికి గల కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా దిల్ రాజు తెలియజేశాడు.

దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ ... హరీష్ శంకర్ నాకు పింక్ మూవీ ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అని అన్నాడు. ఇక అప్పటికే పింక్ మూవీ ని తమిళ్ లో నార్కొండ పార్వై అనే పేరుతో రీమేక్ చేశారు. నేను కూడా దాని ట్రైలర్ చూశాను. నాకు కూడా ఈ సినిమా పవన్ పై వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఒక రోజు నేను త్రివిక్రమ్ గారి దగ్గరకు వెళ్లి నార్కొండ పార్వై ట్రైలర్ ను చూపించాను. బాగుంది విషయం ఏమిటి అని అడిగాడు. ఈ సినిమా పవన్ తో చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే మీరు పవన్ ను కల్పిస్తారేమో అని అడుగుతున్నాను అన్నాను. దానితో త్రివిక్రమ్ , పవన్ కి ఆ సినిమా చూపించడం  అది ఆయనకు నచ్చడం , అలా వకీల్ సాబ్ సినిమా సెట్ కావడం జరిగినట్లు దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: