టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా తో అమాంతం క్రేజ్ పెరిగింది. ఈ చిత్రంతోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. అలాగే మొదటిసారి టాలీవుడ్ పరిశ్రమకు జాతీయ ఉత్తమ నటుడుగా కూడా అవార్డును తీసుకురావడం జరిగింది. దీంతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ మూ ఏర్పరచుకున్నారు అల్లు అర్జున్. అయితే తాను ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా నిజజీవితంలో మాత్రం చాలా సింపుల్ గానే కనిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో రోడ్డు సైడ్ డాబాలో కూడా భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో పిల్లలతో కూడా ఆట్లాడుకుంటూ ఉంటారు.


సాధారణంగా పాన్ ఇండియా హీరో అంటే చాలామంది బౌన్సర్లు కేరవాన్ ఇలా అన్నిటిని కూడా ప్రతిసారి ఉపయోగిస్తూ ఉంటారు కానీ అల్లు అర్జున్ ఇప్పుడు తాజాగా చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక సామాన్యుడు లాగా రోడ్డు మీద నడిచి వెళ్లడం అందరికీ ఆచార్యాన్ని కలిగిస్తోంది. బ్లాక్ అవుట్ స్వీట్లు రోడ్డుపైన అల్లు అర్జున్ చాలా సాదాసీదాగా నడుచుకుంటూ వెళుతున్నా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి అల్లు అర్జున్ చూసినప్పుడు గుర్తుపట్టలేకపోయిన ఆ తర్వాత అల్లు అర్జున్ తెలుసుకొని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


సినిమాల విషయానికి వస్తే.. పుష్ప -2 చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తూ ఉన్నారు రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. ఏడాది డిసెంబర్ ఆరవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు ఈ చిత్ర హైపుని పెంచేశాయి. మరి అల్లు అర్జున్ ఈసారి కూడా తాగడంతో జాతీయస్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: