తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి యాంకర్ రష్మి మొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో మొదలు పెట్టినప్పటికీ ఆ తర్వాత నటిగా హీరోయిన్గా యాంకర్ గా మంచి పాపులారిటీ అందుకున్నది. ఇప్పటికీ బుల్లితెర పైన మకుటం లేని యాంకర్ గా పేర సంపాదించింది. అయితే వివాహ విషయంలో మాత్రం తన దారి సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ విషయం పైన  అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ తాజాగా రష్మిక ఇంట విషాదఛాయలు ఏర్పడినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.



రష్మి తాతయ్య ఈనెల 17న అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని రష్మీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానుల సైతం రష్మికి ధైర్యం చెబుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రష్మీ తన తాత గురించి తెలియజేస్తూ మా తాత నిజమైన శ్రీవాది అంటూ.. చివరికి తన బామ్మ స్వర్గంలో కలుసుకున్నారు అనే విధంగా ఒక ట్విట్టర్ ని షేర్ చేసింది. గత ఏడాది నుంచి ఎక్కువగా తన బామ్మ గురించి మాట్లాడేవారు అంటూ తెలిపింది.


జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా భారీ పాపులర్ సంపాదించుకున్న ఈమె హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో సినిమాలకి పుల్ స్టాప్ పెట్టిన రష్మి బుల్లితెర పైన మాత్రం ఒక వెలుగు వెలుగుతోంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మూగజీవాలపైన ఎవరైనా హింసించిన ఇబ్బంది పెట్టిన వాటి గురించి పోస్టులు పెడితే ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి విషయాన్ని అయినా సరే రష్మీ మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఇటీవల పెళ్లి విషయం పైన కూడా తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పటికీ లేదని తెలియజేసింది సుధీర్ విషయంపై కూడా తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలియజేసింది రష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: