తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబ హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చిరంజీవి అంటే ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న హీరోల పేరు సంపాదించారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలతో ఆయన గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి వివాహం చేసుకున్న అల్లు రామలింగయ్య కూతురు సురేఖ అని తెలిసింది అయితే ఈ వివాహంలో ఒక ట్విస్ట్ ఉందట వాటి గురించి చూద్దాం.



మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడైన బి సత్యనారాయణ ను తీసుకొని ఆయన పెదనాన అయినటువంటి అల్లు రామలింగయ్య గారి ఇంట్లో దింపేందుకు వెళ్లారట. అయితే ఆ సమయంలో రామలింగయ్య గారు ఇంట్లో లేకపోవడంతో తన స్నేహితుడు కాఫీ తాగి వెళ్ళు అని చెప్పగా చిరంజీవి అక్కడే ఆగిపోయారు. లోపల నుంచి కాఫీ సురేఖ తీసుకువచ్చిన చిరంజీవి ఆమె ముఖం కూడా చూడకుండా తాగేసి వెళ్లిపోయారట. ఆ తర్వాత బి సత్యనారాయణ ఆ అబ్బాయి ఎవరు అని సురేఖ అడగగా మనవూరిపాండవులు సినిమాలలో నటించారని తెలిపారట.


అల్లు రామలింగయ్య మాత్రం తన కూతుర్ని కలెక్టర్ కి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారట. కానీ అల్లు అరవింద్ మాత్రం చిరంజీవికే ఇచ్చి వివాహం చేయాలని పట్టు పట్టారు. ఫ్యామిలీ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది. చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తులవ్వడమే కాకుండా ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండడమే కాకుండా బాగా చదువుకొని కష్టపడి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు.. వీటికితోడు జయకృష్ణ అనే మేకప్ మ్యాన్ కూడా అల్లు రామలింగయ్యను కనిపించడంతో చిరంజీవి పెళ్లికి మొదటి అడుగు పడిందని ఒకానొక ఇంటర్వ్యూలో తెలిపారు.


అల్లు రామలింగయ్య దాదాపుగా పదిమంది నిర్మాతలతో చిరంజీవి గురించి తెలుసుకొని సురేఖను ఇచ్చి వివాహం చేశారట. అయితే అప్పుడే వివాహం చేసుకోను అన్నటువంటి చిరంజీవి తన తండ్రి బలవంతంగా ఆమెను ఇచ్చి వివాహం చేశారట. అలా మొదటిసారి చూడకపోయినా చిరంజీవి వివాహ సమయానికి ఆమెను చూశారట. 1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి సురేఖ వివాహం జరిగింది. ఆ తర్వాతే వీరికి శ్రీజ, సుష్మిత, రామ్ చరణ్ జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: