ప్రస్తుతం ప్రభాస్ , అల్లు అర్జున్ , వెంకటేష్ , సిద్దు జొన్నలగడ్డ తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్స్ పై హైదరాబాద్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అల్లు అర్జున్ పై రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు వెంకటేష్ మరియు కొంత మంది ఇతరులపై కేరళ , తమిళ నాడు బార్డర్ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రాసి కన్నా , శ్రీ నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు సిద్దు జొన్నలగడ్డ మరియు శ్రీ నిధి శెట్టి పై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: