టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించక ముందు చాలా సినిమాలకు కథ , మాటలను అందించిన సందర్భాలు ఉన్నాయి. ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూ వీతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో ఈయనకు మంచి విజయం దక్కింది. ఇక పటాస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇప్పటి వరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయనకు సినిమా ఇండస్ట్రీలో మీ మంచి కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ ... వి వి వినాయక్ గారు నా మంచి ఎంతో కోరుకుంటారు. ఆయన నా మొదటి సినిమా నుండి నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తారు. నేను మొదట పటాస్ సినిమా చేశాను. అది విడుదల అయిన తర్వాత ఆ సినిమాను ఆయన చూసి అద్భుతంగా ఉంది. 

బ్లాక్ బాస్టర్ అవుతుంది. నీకు మంచి లైఫ్ ఉంది అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఒక్క సినిమాకు మాత్రమే కాదు నాకు ఎవరి నుండి ఫోన్ వచ్చిన రాకపోయినా నా ప్రతి సినిమాకి వినాయక్ గారి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఆయన నా మంచి ఎంతో కోరుకుంటారు. ఆయన అంటే కూడా నాకు ఎంతో ఇష్టం అని అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: