ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. ఆమె ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను ఒక ఊహించని ప్రశ్న వేశారు. దాంతో ఆమె కంగు తిన్నది. ఇటీవల కోల్‌కతాలో ఒక యువతిని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన సంగతి తెలిసిందే దీని గురించే సమంతను ప్రశ్నించారు. ఇప్పటిదాకా సమంత పెదవి విప్పలేదు. జర్నలిస్టు దీని గురించి ఒక ప్రశ్న వేయడంతో ఆమె సమాధానం చెప్పాల్సి వచ్చింది. మంగళవారం, ఆమెను మహిళల భద్రత గురించి, ముఖ్యంగా కోల్‌కతా కేసు గురించి ప్రశ్నించారు. సమంత ఈ సంఘటనను ఖండించింది. కానీ ఒక్క నిమిషం పాటు ఆమె ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్లు చాలా ఇబ్బందిగా ఫేస్ పెట్టింది. అలానే మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించింది.

సమంత మహిళల భద్రత మనందరికీ ముఖ్యమని చెప్పింది. పరిస్థితులు మారాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆమె ఒక ప్రపంచ పిక్కల్‌బాల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, "ఇప్పుడు మనందరికీ మార్పు అత్యవసరం. మనం నిజంగా కొన్ని మార్పుల కోసం ఎదురు చూస్తున్నాము. మార్పు అనేది ఇప్పుడు అత్యవసరం. ఆ మార్పు త్వరగా వస్తుందని నేను ఆశిస్తున్నాను" అని సమంత తెలిపింది. అని అంత కాన్ఫిడెంట్‌గా, వివరంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయింది. ఆమె అలా ఎందుకు డౌట్ ఫుల్ గా మాట్లాడిందో ఫ్యాన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు.

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసుపై కరీనా కపూర్ ఖాన్, ప్రీతి జింటా వంటి ఇతర నటీమణులు కూడా ముందుగానే స్పందించారు. మరోవైపు సమంత ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మాజీ భర్త నాగ చైతన్య ఆగస్టు 8న శోభితా ధులిపాలతో నిశ్చితార్థం చేసుకున్న కొద్ది రోజులకే ఈ పోస్ట్ ఆమె షేర్ చేసింది. కొంతమంది ఈ పోస్ట్ ఆ నిశ్చితార్థానికి కౌంటర్ గా పెట్టి ఉంటుందని భావిస్తున్నారు. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ పోస్ట్ చేసింది. ఆమె ధరించిన బ్రౌన్ హుడీపై "శాంతి, నిశ్శబ్దం మ్యూజియం" అని రాసి ఉంది. ఆమె వాడిన "నౌ వీ అర్ ఫ్రీ " అనే లెబ్లాంక్ సాంగ్ నెటిజన్ల మధ్య మరింత చర్చకు దారితీసింది.

సమంత తన కొత్త సిరీస్‌ల విడుదలకు సిద్ధమవుతోంది. ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్: హనీ బన్నీ' అనే సిరీస్ చేస్తోంది దీనిపై చాలా అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి 'రక్త బ్రహ్మాండం' అనే మరో ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: