నాచురల్ స్టార్ నాని దర్శకుడు వివేకా ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై  ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు , పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, నాని మరియు ఎస్‌జే సూర్యల కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా

 ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా  ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో నాని, ప్రియాంక మోహన్, నిర్మాత డివివి దానయ్యలతో పాటు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ మీడియా మీట్‌లో ‘సరిపోదా శనివారం’ సినిమా  ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్‌ను వారు అనౌన్స్ చేశారు. కాగా ఆగస్టు 24న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని వారు తెలిపారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రేక్షకులంతా ఎంతో

 ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అతిథులు హాజరు కానున్నర అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో జరగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 29న గ్రాండ్గా ఆప్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాని ఈ సినిమాతో ఎంతటి ఘన విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: