నేడు ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీమణి సురేఖతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరంజీవివి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగాస్టార్ నటించిన ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రాలు విడుదల

 అయ్యాయి. థియేటర్స్ వద్ద ఫాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో చిరు ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. బింబిసార' వంటి సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన వశిష్ఠ..మెగాస్టార్ చిరంజీవితో కూడా అదే సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఔట్ పుల్ కూడా వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీటైనట్టు సమాచారం. చిరంజీవి కూడా తన పాత్రకు

 డబ్బింగ్ కూడా చెప్పేసారు. ఈ రోజు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఇప్పటికే విడదల చేసిన పోస్టర్ చూస్తుంటే.. చేతిలో శూలం పట్టుకొని ఉన్న చిరంజీవి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ లు నటిస్తున్నారు. చాలా యేళ్ల తర్వాత చిరు సరసన ముగ్గురు భామలు నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవికి కీలకం అనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: