సోషల్ మీడియాలో,మెయిన్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది.ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే తాజాగా ఈరోజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈరోజు మంచి రోజు కావడంతో ముహూర్తం చూసుకొని మరీ తన పార్టీ జెండాని ఆవిష్కరించారు.తన పార్టీ జెండా పసుపు రంగులో రెండు యుద్ధపు ఏనుగులు అలాగే వాగాయ పువ్వులతో ఉంది.ఇక వెట్రి కజగం అనే పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్ కి సంబంధించిన ఒక వార్త కోలీవుడ్ మీడియాలో దుమారం సృష్టిస్తోంది.అదేంటంటే.. ఎవరైనా సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఏదైనా గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు కుటుంబంతో వచి ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారు.

కానీ తాజాగా వెట్రి కజగం పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్ తన కుటుంబంలో గొడవలు ఉన్నట్టు చెప్పకనే చెప్పారు.అయితే ఈ పార్టీ జెండా ఆవిష్కరణలో విజయ్ తల్లిదండ్రులు డైరెక్టర్ ఎస్ ఎ చంద్రశేఖర్, శోభలు వచ్చారు కానీ ఈ జెండా ఆవిష్కరణ సమయంలో విజయ్ భార్య, పిల్లలు లేకపోవడం ప్రస్తుతం మీడియాలో కొత్త చర్చకు దారితీస్తోంది.అయితే గత కొద్ది రోజుల నుండి విజయ్ సంగీత ఇద్దరూ దూర దూరంగా ఉంటున్నారని,ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోతున్నారని,త్వరలోనే వీరి విడాకులు అఫీషియల్ గా బయటపడతాయని కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఇలాంటి నేపథ్యంలో భర్త పార్టీ జెండా ఆవిష్కరణలో భార్య కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అంతేకాదు ఈ జెండా ఆవిష్కరణ సమయంలో సంగీత మాత్రమే కాదు ఆయన ఇద్దరు పిల్లలు కూడా లేరు. దీంతో వీరి విడాకుల వార్తలు కోలీవుడ్లో మరింత ఉపందుకున్నాయి. అయితే విజయ్ సన్నిహితులు మాత్రం సంగీత తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిందని, అందుకే విజయ్ పార్టీ జెండా ఆవిష్కరణలో కనిపించలేదని అంటున్నారు. మరి నిజంగానే పిల్లల చదువుల కోసం విదేశాల్లో ఉండి రాలేకపోయిందా లేక విజయ్ సంగీత మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఇక గత కొద్ది రోజులుగా త్రిష కారణంగా విజయ్ సంగీతల మధ్య దూరం పెరిగింది అనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: